![]() |
![]() |
by Suryaa Desk | Tue, May 20, 2025, 04:15 PM
రాజన్న సిరిసిల్ల(D) కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై NHRC సీరియస్ అయింది. గత ఆగస్టు 2న పిట్ల రామలక్ష్మి(78) అనే వృద్ధురాలిని వీధి కుక్కలు చంపి తిన్న ఘటనపై న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదు చేయగా NHRC విచారణ చేపట్టింది. గతంలో నివేదిక కోరడంతో జిల్లా యంత్రాంగం సరైన నివేదిక సమర్పించలేదని కమిషన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. తమ అధికారాలను వినియోగించి కలెక్టర్ను వ్యక్తిగతంగా హాజరు అయ్యేవిధంగా చూస్తామంది.