![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 08:45 AM
సూపర్నేచురల్ హారర్ థ్రిల్లర్ 'డీమోంటే కాలనీ 2' సినిమాలో అరుళ్నితి, ప్రియా భవాని శంకర్ మరియు అర్చన రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సీక్వెల్కు ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జీ సినిమాలు ఛానల్ లో జూన్ 27న రాత్రి 9 గంటలకి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించనున్నట్లు సమాచారం. శ్రీ బాలాజీ ఫిలిమ్స్ పతాకంపై బి. సురేష్ రెడ్డి మరియు బి. మానస రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ఆంటి జస్కెలైన్, త్సెరింగ్ డోర్జీ మరియు అరుణ్ పాండియన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. జ్ఞానముత్తు పట్టరై మరియు వైట్ నైట్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి BTG యూనివర్సల్ బ్యానర్పై బాబీ బాలచంద్రన్ ఈ సినిమాని నిర్మించారు.
Latest News