![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 05, 2025, 12:53 PM
తమిళంలో ఇటీవల విడుదలైన డీఎన్ఏ మూవీ మంచి విజయం సాధించింది. దీంతో ఈ మూవీని 'మై బేబీ' పేరుతో ఎస్.కె. పిక్చర్స్ ద్వారా జులై 11న సురేష్ కొండేటి తెలుగులో విడుదల చేస్తున్నారు. సురేష్ కొండేటి ఇప్పుడు ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ మూవీలో అధర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు.నెల్సన్ వెంకటేసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆథర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్, భావోద్వేగాలతో కూడిన కథాంశంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 2014లో ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథ రూపొందింది. పిల్లల అపహరణలు, ఆసుపత్రులలో పిల్లలను మార్చడం వంటి సున్నితమైన సామాజిక సమస్యలను ఈ చిత్రం స్పృశించిందని, ఇది సమాజంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి గుర్తు చేస్తుందని చిత్ర బృందం పేర్కొంది.
Latest News