![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 12:49 PM
కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తుర్కపల్లి సురేందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 3వ సారి అధికారం లోకి వచ్చిన తర్వాత కార్మికులు బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న 29చట్టాలను సవరణ లు చేస్తూ, వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, ఫ్యాక్టరీ చట్టంసామాజిక భద్రత కోడ్ ఈ నాలుగు కోడ్ ల ను తీసుకువచ్చి 29 చట్టాలను రద్దు చేసిందని, ఈ కోడ్ లకు వ్యతిరేకంగా ఈరోజు దేశ వ్యాప్తంగా కార్మిక లోకం ఉద్యమిస్తుందని అన్నారు. ఈ కోడ్ లు అమలు జరిగితే కార్మికుల పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానం బదులుగా 12 గంటల పని విధానం వస్తుందని, అంతేకాకుండా సంఘం పెట్టుకునే హక్కు కూడా కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కోడ్ లకు వ్యతిరేకంగా జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో పైళ్ల గణపతి రెడ్డి, కొండె నరసింహ, ఉక్కుర్తి రాములు, ఎడవెల్లి ఎల్లమయ్య, జన్ని జంగయ్య, నరసింహ, వలయ్య, వీరస్వామి, అంజయ్య, తాళ్ళ సత్తయ్య, లలిత, రేణుక, పుష్ప పాల్గొన్నారు.