![]() |
![]() |
by Suryaa Desk | Tue, May 20, 2025, 04:26 PM
TG: హిజ్రాల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ రైలులో హిజ్రాలు రెచ్చిపోయారు. ఓ వ్యక్తి వద్ద డబ్బులు డిమాండ్ చేసి, అపై అతని వద్ద పర్సు లాక్కొని అందులోని రూ.10 వేలు తీసుకొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్ పోలీసులు నలుగురు హిజ్రాలను అరెస్ట్ చేశారు. కొంతకాలంగా రైళ్లలో బలవంతంగా హిజ్రాలు ఇలా డబ్బులు లాక్కుంటున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి.