![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 06:17 PM
పాకిస్థాన్కు తగిన రీతిలో గుణపాఠం చెప్పడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. అమెరికా వంటి దేశాల ఒత్తిళ్లకు తలొగ్గి, పాకిస్థాన్ విషయంలో కీలక అవకాశాలను కేంద్రం చేజార్చుకుందని ఆయన ఆరోపించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.పాకిస్థాన్తో వ్యవహరించే తీరులో మోదీ ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోయిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాకిస్థాన్తో యుద్ధ సమయంలో అమెరికాతో సహా పలు ప్రపంచ దేశాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదురైనా, వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా యుద్ధాన్ని కొనసాగించి విజయం సాధించారని ఆయన గుర్తు చేశారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వం విషయంలో తాము ఎలాంటి రాజకీయాలు చేయబోమని స్పష్టం చేశారు.