![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:49 PM
పటాన్చెరు : పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు.పటాన్చెరు మండలం రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలో సిఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనంభూమి అంశంలో నష్టపోతున్న అసైన్మెంట్ భూమి లబ్ధిదారులకు ఎమ్మెల్యే జిఎంఆర్ అండగా నిలిచారు. గ్రామంలో ఆధునిక వసతులతో పాఠశాల నిర్మాణం పూర్తయితే నిరుపేద విద్యార్థులకు కార్పోరేట్ విద్యను అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది లభిస్తుందని భావించి సంబంధిత భూమి లబ్ధిదారులతో ఇటీవల చర్చించి... పాఠశాల నిర్మాణానికి భూమి అందించేలా వారిని ఒప్పించారు. ఈ మేరకు గురువారం గ్రామ పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం ఆవరణలో గ్రామపుర ప్రముఖుల సమక్షంలో భూమి లబ్ధిదారులు జొన్నాడ మహేష్, జహంగీర్లకు 5 లక్షల రూపాయల చొప్పున..10 లక్షల రూపాయల సొంత నిధులు అందజేశారు. పాఠశాల నిర్మాణానికి భూమి అంతరించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి అభినందించారు. దశాబ్ద కాలంగా తన విజయాల్లో వెన్నింటిగా నిలుస్తూ ఇటీవల మృతి చెందిన రుద్రారం గ్రామానికి చెందిన కురుమ నరసింహులు కుటుంబానికి ఎమ్మెల్యే జిఎంఆర్ తోడుగా నిలిచారు. గురువారం రుద్రారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. నర్సింలు కుటుంబాన్ని పరామర్శించి.. లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో అండగా ఉంటానని అభయహస్తం అందించారు.