దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:48 PM
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, భారత్పైకి ఉసిగొల్పుతున్న తీరును అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడిన అఖిలపక్ష బృందాలను పలు దేశాలకు పంపిస్తోంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), జపాన్లలో పర్యటిస్తున్న భారత బృందాలు అక్కడి ప్రభుత్వ పెద్దలతో సమావేశమై పాకిస్థాన్ దుశ్చర్యలు, ఉగ్రవాద నియంత్రణకు భారత్ తీసుకుంటున్న 'ఆపరేషన్ సిందూర్' వంటి చర్యల గురించి వివరిస్తున్నాయి. ఈ దౌత్యపరమైన యత్నాలకు సానుకూల స్పందన లభిస్తోందని మన రాయబార కార్యాలయాలు వెల్లడించాయి.