|
|
by Suryaa Desk | Mon, May 19, 2025, 03:18 PM
అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా. కిష్టయ్య కూతురు వైద్య విద్య కోసం ఆర్థిక సాయం అందజేత.ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఉద్యమ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి తన సహాయాన్ని కొనసాగిస్తూనే ఉన్న కేసీఆర్ ఆదివారం నాడు అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసం లో అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసారు.రాష్ట్ర సాధనకోసం జరిగిన పోరాటంలో తన ప్రాణాలను బలిదానం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని అన్నీ తానై కేసీఆర్ గారు ఆదుకుంటున్న విషయం తెలిసిందే.కిష్టయ్య కుమార్తె ప్రియాంక చదువుకు కేసీఆర్ గారు ఆర్థిక సాయం అందిస్తున్నారు. వైద్యవిద్య లో ఆసక్తికనబరిచిన ప్రియాంక ను ఇప్పటికే కేసీఆర్ గారు, ఎంబీబిఎస్ చదివించారు.ఎంబిబిఎస్ పూర్తిచేసుకుని పి జి చేస్తున్న డాక్టర్ ప్రియాంక చదువుకు కావలసిన ఆర్థిక సాయాన్ని నేడు కేసీఆర్ గారు కిష్టయ్య భార్యా పిల్లలకుఅందించారు.పోలీసు కిష్టయ్య కుటుంబానికి తన సంపూర్ణ సహకారం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ గారు భరోసా ఇచ్చారు.