|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 03:11 PM
గత కొంత కాలంగా రాష్ట్ర రాజకీయాలలో ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారానికి ఎట్టకేలకి స్పీకర్ గడ్డం ప్రసాద్ తెరదించారు. అధికార పార్టీలో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేస్తూ, వీరికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ అంశంపై రేపు (గురువారం) సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కోర్టు విచారణకు ముందు రోజు ఈ వ్యవహారంపై స్పీకర్ తన విచారణను ముగించి, తీర్పులను వెలువరించారు. దానం, కడియంలతో పాటు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అధికారికంగా పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని, ఈ కారణంగా వారిపై అనర్హత వేటు వేయలేమని స్పీకర్ తన తీర్పులో స్పష్టం చేశారు.