|
|
by Suryaa Desk | Mon, May 19, 2025, 03:46 PM
ఏఐ వాడకం రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ రోజుల్లో స్వీడన్ కు చెందిన ఓ కంపెనీ మాత్రం మనుషులను నియమించుకోవడానికే మొగ్గు చూపుతోంది. రెండేళ్ల క్రితం ఇదే కంపెనీ ఏఐ సేవలను విస్తృతంగా ఉపయోగించుకుంటూ ఉద్యోగులను తొలగించింది. రెండేళ్ల పాటు వినియోగించుకున్న తర్వాత ఏఐ సేవల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఏఐ కంటే మనుషులే మేలని చెబుతూ గతంలో తొలగించిన ఉద్యోగులను వెనక్కి రమ్మని పిలుస్తోంది. స్వీడన్కు చెందిన ప్రముఖ ఫిన్టెక్ సంస్థ క్లార్నా తాజాగా ఈ ప్రకటన చేసింది. కృత్రిమ మేధ ఆధారిత కస్టమర్ సేవా ఏజెంట్ల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంది. రెండేళ్ల క్రితం ఖర్చులు తగ్గించుకుని, సామర్థ్యం పెంచుకునేందుకు ఓపెన్ఏఐతో జతకట్టి ఏఐ వినియోగాన్ని భారీగా పెంచిన క్లార్నా, ఇప్పుడు తన నిర్ణయంపై పునరాలోచిస్తోంది. క్లార్నా సీఈఓ సెబాస్టియన్ సిమియాట్కోవ్స్కీ మాట్లాడుతూ.. ఏఐ ఏజెంట్ల సేవల నాణ్యత తక్కువగా ఉందన్నారు. "ఖర్చు తగ్గించుకోవడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల సేవల నాణ్యత దెబ్బతింది. వినియోగదారులకు అవసరమైనపుడు వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ఒక మనిషి అందుబాటులో ఉంటాడనే భరోసా ఇవ్వడం కంపెనీ బ్రాండ్కు చాలా ముఖ్యం" అని ఆయన స్పష్టం చేశారు.