|
|
by Suryaa Desk | Thu, Jul 24, 2025, 08:08 PM
పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించింది. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. హైదరాబాద్, కాచిగూడ నుండి మదురై, కొల్లాం, కన్యాకుమారికి వెళ్లే రైళ్ల సర్వీసులు పొడిగించబడ్డాయి. ఈ రైళ్ల సమయాలను తెలుసుకొని మీ ప్రయాణాలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. టికెట్లు ఆన్లైన్లో లేదా కౌంటర్లలో బుక్ చేసుకునే అవకాశం ఉంది.
రైలు ప్రయాణికుల సౌకర్యార్థం.. ముఖ్యంగా పండుగలు, సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ప్రయోజనం చేకూర్చనుంది. ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుండి బయలుదేరే కొన్ని కీలకమైన ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగించబడ్డాయి. ఈ అదనపు సర్వీసులు ప్రయాణికుల రద్దీని తగ్గించడంలో.. గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోవడంలో సహాయపడతాయి.
ఈ రైలు సర్వీసును ఆగస్టు 20 నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించారు. బుధవారం నాడు బయలుదేరే ఈ రైలు మొత్తం 9 సర్వీసులు నడుపుతుంది.
ట్రైన్ నంబర్ 07193 హైదరాబాద్-కొల్లం స్పెషల్:
ఈ రైలు సర్వీసును ఆగస్టు 16 నుండి అక్టోబర్ 11వ తేదీ వరకు పొడిగించారు. శనివారం నాడు బయలుదేరే ఈ రైలు మొత్తం 9 సర్వీసులు నడుపుతుంది.
ట్రైన్ నంబర్ 07194 కొల్లం-హైదరాబాద్ స్పెషల్:
ఈ రైలు సర్వీసును ఆగస్టు 18 నుండి అక్టోబర్ 13వ తేదీ వరకు పొడిగించారు. సోమవారం నాడు బయలుదేరే ఈ రైలు మొత్తం 9 సర్వీసులు నడుపుతుంది.
ట్రైన్ నంబర్ 07230 హైదరాబాద్-కన్నియాకుమారి స్పెషల్:
ఈ రైలు సర్వీసును ఆగస్టు 13 నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు పొడిగించారు. బుధవారం నాడు బయలుదేరే ఈ రైలు మొత్తం 9 సర్వీసులు నడుపుతుంది.
ట్రైన్ నంబర్ 07229 కన్నియాకుమారి-హైదరాబాద్ స్పెషల్:
ఈ రైలు సర్వీసును ఆగస్టు 15 నుండి అక్టోబర్ 10వ తేదీ వరకు పొడిగించారు. శుక్రవారం నాడు బయలుదేరే ఈ రైలు మొత్తం 9 సర్వీసులు నడుపుతుంది.
ప్రయాణికులకు విజ్ఞప్తి..
ఈ ప్రత్యేక రైళ్లు దక్షిణ భారతదేశంలోని ముఖ్య నగరాలకు తెలంగాణ నుండి రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఏ ట్రైన్లో ప్రయాణించాలి..? ఎప్పుడు ప్రయాణించాలనే ఒక క్లారిటీని కల్పిస్తాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు వెళ్లే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పండుగ సీజన్లలో, ముఖ్యంగా దసరా, దీపావళి వంటి పర్వదినాల్లో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి ఈ పొడిగింపులు ఎంతగానో సహాయపడతాయి.
దక్షిణ మధ్య రైల్వే అధికారులు, దక్షిణ రైల్వే అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. తమిళనాడు, కేరళ ప్రజలు ఈ రైలు సమయాలను, తేదీలను దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టికెట్ల కోసం ఆన్లైన్లో లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో ముందస్తుగా బుక్ చేసుకోవడం ద్వారా చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాలను నివారించవచ్చు. రైల్వే శాఖ ఇలాంటి ప్రత్యేక సర్వీసులను పొడిగించడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి కట్టుబడి ఉందని స్పష్టం అవుతోంది. భవిష్యత్తులో కూడా రద్దీని బట్టి మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపే అవకాశం ఉంది.