|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 03:37 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చించారు. ఇవాళ(సోమవారం) ఖమ్మం కలెక్టరేట్లో అభివృద్ధి పనులపై జిల్లా అధికార యంత్రాంగంతో సమావేశం నిర్వహించారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు.మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ట్రయిల్ రన్ని ఈనెల 24వ తేదీన నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రఘునాధపాలెం మండలంలోని చెరువులన్నిటిని నింపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద సబ్స్టేషన్ నిర్మాణం కోసం ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డితో మాట్లాడి తక్షణమే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని దిశా నిర్దేశం చేశారు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై కోడుమూరు గ్రామం వద్ద ఉన్న హై టెన్షన్ లైన్ను తక్షణమే మార్చేలా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ కో డైరెక్టర్ లతా వినోదకు సూచించారు.