|
|
by Suryaa Desk | Fri, Jul 18, 2025, 12:26 PM
బంజారా హిల్స్లో నాలాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పరిశీలించారు. రోడ్డు నంబరు 14, 3లలో తలెత్తుతున్న వరద సమస్యకు గల కారణాలను క్షేత్ర స్థాయిలో తెలుసుకున్నారు. రోడ్డు నంబరు 3లోని జ్యోతి నెస్ట్ నివాసితులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్శ్రీ ఏవీ రంగనాథ్ గారు గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కేబీఆర్ పార్కు, నందినగర్ మీదుగా బంజారాహిల్స్ నుంచి జలగం వెంగళరావు పార్కులోని చెరువులోకి చేరే వరద కాలువను పరిశీలించారు. పైన 4 మీటర్ల వెడల్పుతో ఉన్న నాలా బంజారాహిల్స్రోడ్డు నంబరు 3 వద్దకు వచ్చేసరికి కొన్నిచోట్ల 2 మీటర్లకే పరిమితమవ్వడాన్ని చూశారు. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 14తో పాటు 3 లోనూ నాలాలు కుంచించుకుపోవడాన్ని పరిశీలించారు. పైన 4 మీటర్ల వెడల్పుతో ఉన్న బాక్సు డ్రైన్ రోడ్డు నంబరు 3కి వచ్చేసరికి 2 మీటర్ల వెడల్పునకు పరిమితమైంది. అలాగే ఒక మీటరు వెడల్పు ఉన్న పైపు లైను ఏర్పాటు చేయడంతో ఎగువ నుంచి భారీ మొత్తంలో వస్తున్నవరద పోటెత్తే పరిస్థితి ఏర్పడుతోందని హైడ్రా కమిషనర్కు అధికారులు చెప్పారు. బఫర్ లేకుండా చేయడమే కాకుండా నాలాను కూడా ఆక్రమించడం పట్ల కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైనుంచి చివరి వరకూ నాలా వెడల్పును పరిశీలించి వరద ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.