![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 02:35 PM
తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో విస్తృతంగా పెట్టుబడులు పెట్టేందుకు కోల్ ఇండియాతో పాటు NCL ఇండియా సంస్థలు సిద్ధంగా ఉన్నాయని లేఖలో తెలిపారు. సౌర, పవన్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఈ రెండు సంస్థలు ముందుకు వచ్చాయని పేర్కొన్నారు. పంప్డ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంటే తెలంగాణకు ప్రత్యక్ష్యంగా రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రస్తావించారు.