![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 14, 2025, 12:33 PM
సంకష్ఠ చతుర్థి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామ శివారులో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో సోమవారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి అభిషేకాలు, సింధూర లేపనం, అలంకరణ గావించి అష్టోత్తర శతనామ స్తోత్ర యుక్తముగా పూజలు జరిపారు. తొలి మొక్కల దేవుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.