![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 12:29 PM
సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట గ్రామంలో కొలువైయున్న శ్రీ పద్మావతి అలువేలుమంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వారోత్సవ పూజలను శనివారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ దేవేరులతో శ్రీవారికి అభిషేకాలు అలంకరణ గావించి అష్టోత్తర శతనామ స్తోత్ర పూజలను జరిపారు. అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేద ఆశీస్సులు అందించిన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలు అందజేశారు.