దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 11:42 AM
సరూర్నగర్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు, అపార్ట్మెంట్ పక్కన పార్కింగ్ చేసి ఉన్న రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తం మూడు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తెల్లవారుజామున నిద్రలో ఉన్న స్థానికులకు పెద్ద శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడ్డారు. బయటికి వచ్చి చూడగా, పార్కింగ్ చేసి ఉన్న రెండు కార్లు నుజ్జునుజ్జు అయి ఉండగా, వాటిని ఢీకొట్టిన స్విఫ్ట్ కారు కూడా బాగా దెబ్బతిని ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్విఫ్ట్ కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.