'జల హారతి' కార్యక్రమానికి అనకాపల్లి టిడిపి క్యాడర్
'జల హారతి' కార్యక్రమానికి అనకాపల్లి టిడిపి క్యాడర్
అనకాపల్లి: సెప్టెంబర్ 2, మేజర్ న్యూస్: జిల్లా, పాయకరావుపేట లో ఉత్తరాంధ్ర రైతుల దాహార్తిని తీర్చేందుకు గోదావరి జలాలను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వరకు తరలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరగనున్న జలహారతికి అనకాపల్లి నుంచి పాయకరావుపేట సభ స్థలానికి బస్సుల్లో బయలుదేరిన టిడిపి కార్యకర్తలను, ప్రజలను తెలుగుదేశం పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ జండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సుల్లో ఏర్పాటు చేసిన ఆహార ప్యాకట్లను పరిశీలించారు.