కేరళలో రొనాల్డో సోదరి ఎల్మా అవేరో సందడి
సీఎం వి.డి. సతీసన్తో భేటీ
తిరువనంతపురం: పోర్చుగల్ ఫుట్బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవేరో కేరళ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వి.డి. సతీసన్ను కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆత్మీయ సంభాషణ జరిగింది.
ముఖ్యమంత్రి సతీసన్ ఈ భేటీకి సంబంధించిన వివరాలను పంచుకుంటూ కేరళలో ఫుట్బాల్కు, ముఖ్యంగా క్రిస్టియానో రొనాల్డోకు ఉన్న అపారమైన క్రేజ్, అభిమానుల ప్రేమ గురించి ఎల్మాకు వివరించినట్లు తెలిపారు.
కేరళ అభిమానుల తరఫున ఈ హృదయపూర్వక ప్రేమ సందేశాన్ని రొనాల్డోకు తప్పకుండా చేరవేస్తానని ఎల్మా అవేరో హామీ ఇచ్చారని సీఎం పేర్కొన్నారు. రొనాల్డో సోదరి కేరళ పర్యటనకు రావడం, సీఎంను కలవడంతో స్థానిక ఫుట్బాల్ అభిమానుల్లో తీవ్ర ఉత్సాహం వ్యక్తమవుతోంది.