telanagana
420 హామీల ఫ్లెక్సీతో బీఆర్ఎస్ నిరసన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గంగుల కమలాకర్ ధ్వజం కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ నిరసన..
సూర్య కరీంనగర్ ప్రతినిధి :కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కరీంనగర్ తెలంగాణ చౌక్లో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 500 మంది కార్యకర్తలు, ప్రజలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలతో కూడిన భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఫీజు రీయింబర్స్మెంట్, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, ఆసరా పెన్షన్లు, యువతులకు స్కూటీల హామీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెల్లించాల్సిన బకాయిలను సూచిస్తూ రూపొందించిన ‘బాకీ కార్డు’లను బాటసారులు, వాహనదారులు, బస్సు ప్రయాణికులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్వయంగా అందించారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరాదాసు లక్ష్మణ్ రావు, పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, పార్టీ మండల శాఖ అధ్యక్షులు పెండ్యాల శ్యాం సుందర్ రెడ్డి, కాసారపు శ్రీనివాస్ గౌడ్, మైనారిటీ నగరశాఖ అధ్యక్షులు మీర్ సౌకత్ అలీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.