BREAKING
‘రష్యా గగనతలం పూర్తిగా అసురక్షితం’ ‘సుఖదుఃఖాల్లో భారత్ మా వెంటే’ రైతులు, ఉపాధ్యాయులపై పెండింగ్ కేసులన్నీ రద్దు వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి 420 హామీల ఫ్లెక్సీతో బీఆర్ఎస్ నిరసన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గంగుల కమలాకర్ ధ్వజం కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన.. 'జల హారతి' కార్యక్రమానికి అనకాపల్లి టిడిపి క్యాడర్ ‘ఇన్వెస్ట్ తెలంగాణ’కు రాజ్ నాథ్ సింగ్‌కు ఆహ్వానం 11,993 మంది సురక్షితం.. 3,916 మంది గల్లంతు! వైఎస్సార్‌కు ఘన నివాళులు కేరళలో రొనాల్డో సోదరి ఎల్మా అవేరో సందడి బూటకపు కాంగ్రెస్‌ మాటలు నమ్మొద్దు.. నా హయాంలో రూ.1,680 కోట్లతో అభివృద్ధి పనులు పైలెట్‌ తాండూరులో గర్జించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి 1,114 మృతదేహాలు వెలికితీత..ప్రధాని ప్రకటన సెప్టెంబర్ 24న థియేటర్లలో ప్రళయం - నాని The Paradise బిగ్గెస్ట్ రిలీజ్ - టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే మోస్ట్ అవైటెడ్ మూవీ! Huawei సంచలనం - నేడే ఒకేసారి 5 కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ - Watch GT 7 నుండి MatePad Pro వరకు - Munich లో Chase The Wild ఈవెంట్ లైవ్! కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం యూటర్న్? రంగంలోకి అగ్రనేతలు!

420 హామీల ఫ్లెక్సీతో బీఆర్ఎస్ నిరసన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గంగుల కమలాకర్ ధ్వజం కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన..

Select Suryaa Now
420 హామీల ఫ్లెక్సీతో బీఆర్ఎస్ నిరసన  కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గంగుల కమలాకర్ ధ్వజం  కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన..
 
సూర్య కరీంనగర్ ప్రతినిధి :కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 500 మంది కార్యకర్తలు, ప్రజలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలతో కూడిన భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఫీజు రీయింబర్స్‌మెంట్, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, ఆసరా పెన్షన్లు, యువతులకు స్కూటీల హామీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెల్లించాల్సిన బకాయిలను సూచిస్తూ రూపొందించిన ‘బాకీ కార్డు’లను బాటసారులు, వాహనదారులు, బస్సు ప్రయాణికులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్వయంగా అందించారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరాదాసు లక్ష్మణ్ రావు, పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, పార్టీ మండల శాఖ అధ్యక్షులు పెండ్యాల శ్యాం సుందర్ రెడ్డి, కాసారపు శ్రీనివాస్ గౌడ్, మైనారిటీ నగరశాఖ అధ్యక్షులు మీర్ సౌకత్ అలీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.