BREAKING
1,114 మృతదేహాలు వెలికితీత..ప్రధాని ప్రకటన సెప్టెంబర్ 24న థియేటర్లలో ప్రళయం - నాని The Paradise బిగ్గెస్ట్ రిలీజ్ - టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే మోస్ట్ అవైటెడ్ మూవీ! Huawei సంచలనం - నేడే ఒకేసారి 5 కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ - Watch GT 7 నుండి MatePad Pro వరకు - Munich లో Chase The Wild ఈవెంట్ లైవ్! కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం యూటర్న్? రంగంలోకి అగ్రనేతలు! కాంగ్రెస్ ‘1000 రోజుల విఫల పాలన’పై ఉధృతమైన బీఆర్ఎస్ నిరసనలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ఛార్జ్‌షీట్: హరీశ్ రావు తీవ్ర ధ్వజం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ నెరవేరిన ఉత్తరాంధ్ర వాసుల కల ..తరలి వచ్చిన గోదారమ్మ నేడు లాచనంగా జలాలు విడుదల చేయనున్న చంద్ర బాబు భూభారతి రీ-సర్వేపై అవగాహన సదస్సు మొగల్తూరులో సీఎం చంద్రబాబు పర్యటన: మత్స్యకారులతో మమేకమై పింఛన్ల పంపిణీ Google షాకింగ్ డెసిషన్ - 8 ఏళ్ల Google Assistant క్లోజ్ - సెప్టెంబర్ 4 నుండి శాశ్వతంగా బంద్ - ఇక అన్ని ఫోన్లలో Gemini యే! Apple కంపెనీలో ఊహించని బిగ్ షాక్ - టాప్ పదవిలో భారీ మార్పు! కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు షాక్: రూ. 9.50 పెరిగిన సిలిండర్ ధర.. కొత్త రేట్లు ఇవే! దుల్కర్ ఐ యామ్ గేమ్ సెప్టెంబర్ 3న రిలీజ్ - రోమాంచకంతో బిగ్ క్లాష్!

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ఛార్జ్‌షీట్: హరీశ్ రావు తీవ్ర ధ్వజం

Select Suryaa Now
కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ఛార్జ్‌షీట్: హరీశ్ రావు తీవ్ర ధ్వజం

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, అరాచక పాలనను ఎండగడుతూ ప్రజల ముందుకు ‘ఛార్జ్ షీట్’ తీసుకొచ్చినట్లు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తెలిపారు. పాలనాపరంగా వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆరు గ్యారంటీల పేరుతో బాండ్ పేపర్లు రాసిచ్చి, 1000 రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కేసీఆర్ అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి, పూర్తిగా నాశనం చేసి కుప్పకూల్చారు.

పురోగమనం వైపు వేగంగా ప్రయాణించాల్సిన తెలంగాణ రాష్ట్రం, ఈ ప్రభుత్వ చేతకానితనం వల్ల తిరోగమనం వైపు పయనిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను, ఇచ్చిన హామీల విస్మరణను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని ఈ ఛార్జ్ షీట్ విడుదల సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.