BREAKING
420 హామీల ఫ్లెక్సీతో బీఆర్ఎస్ నిరసన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గంగుల కమలాకర్ ధ్వజం కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన.. 'జల హారతి' కార్యక్రమానికి అనకాపల్లి టిడిపి క్యాడర్ ‘ఇన్వెస్ట్ తెలంగాణ’కు రాజ్ నాథ్ సింగ్‌కు ఆహ్వానం 11,993 మంది సురక్షితం.. 3,916 మంది గల్లంతు! వైఎస్సార్‌కు ఘన నివాళులు కేరళలో రొనాల్డో సోదరి ఎల్మా అవేరో సందడి బూటకపు కాంగ్రెస్‌ మాటలు నమ్మొద్దు.. నా హయాంలో రూ.1,680 కోట్లతో అభివృద్ధి పనులు పైలెట్‌ తాండూరులో గర్జించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి 1,114 మృతదేహాలు వెలికితీత..ప్రధాని ప్రకటన సెప్టెంబర్ 24న థియేటర్లలో ప్రళయం - నాని The Paradise బిగ్గెస్ట్ రిలీజ్ - టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే మోస్ట్ అవైటెడ్ మూవీ! Huawei సంచలనం - నేడే ఒకేసారి 5 కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ - Watch GT 7 నుండి MatePad Pro వరకు - Munich లో Chase The Wild ఈవెంట్ లైవ్! కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం యూటర్న్? రంగంలోకి అగ్రనేతలు! కాంగ్రెస్ ‘1000 రోజుల విఫల పాలన’పై ఉధృతమైన బీఆర్ఎస్ నిరసనలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ఛార్జ్‌షీట్: హరీశ్ రావు తీవ్ర ధ్వజం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

1,114 మృతదేహాలు వెలికితీత..ప్రధాని ప్రకటన

Select Suryaa Now
1,114 మృతదేహాలు వెలికితీత..ప్రధాని ప్రకటన

కాఠ్‌మాండ్: నేపాల్‌లో సంభవించిన వినాశకరమైన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. సహాయక చర్యల్లో ఇప్పటివరకు మొత్తం 1,114 మృతదేహాలను వెలికితీసినట్లు నేపాల్ ప్రధాని బాలేంద్ర (బాలేన్) షా వెల్లడించారు.

అయితే, డిఎన్‌ఏ నమూనాల ద్వారా గుర్తింపు ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో ఇప్పటివరకు కేవలం 95 మృతదేహాలను మాత్రమే గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ విపత్తు వల్ల సంభవించిన ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురుతుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాల ఆధారాలు, డిఎన్‌ఏ (DNA) నమూనాలను భద్రపరుస్తున్నట్లు పేర్కొన్నారు.

గుర్తింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే మృతదేహాలను బంధువులకు అందజేస్తామని, మిగిలిన వారి గుర్తింపు కోసం శాస్త్రీయ పద్ధతులను ఉపయోగిస్తున్నామని స్పష్టం చేశారు. ఇంకా వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం అందడంతో నేపాల్ సైన్యం, పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.