1,114 మృతదేహాలు వెలికితీత..ప్రధాని ప్రకటన
కాఠ్మాండ్: నేపాల్లో సంభవించిన వినాశకరమైన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. సహాయక చర్యల్లో ఇప్పటివరకు మొత్తం 1,114 మృతదేహాలను వెలికితీసినట్లు నేపాల్ ప్రధాని బాలేంద్ర (బాలేన్) షా వెల్లడించారు.
అయితే, డిఎన్ఏ నమూనాల ద్వారా గుర్తింపు ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో ఇప్పటివరకు కేవలం 95 మృతదేహాలను మాత్రమే గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ విపత్తు వల్ల సంభవించిన ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురుతుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాల ఆధారాలు, డిఎన్ఏ (DNA) నమూనాలను భద్రపరుస్తున్నట్లు పేర్కొన్నారు.
గుర్తింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే మృతదేహాలను బంధువులకు అందజేస్తామని, మిగిలిన వారి గుర్తింపు కోసం శాస్త్రీయ పద్ధతులను ఉపయోగిస్తున్నామని స్పష్టం చేశారు. ఇంకా వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం అందడంతో నేపాల్ సైన్యం, పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.