BREAKING
సెప్టెంబర్ 24న థియేటర్లలో ప్రళయం - నాని The Paradise బిగ్గెస్ట్ రిలీజ్ - టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే మోస్ట్ అవైటెడ్ మూవీ! Huawei సంచలనం - నేడే ఒకేసారి 5 కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ - Watch GT 7 నుండి MatePad Pro వరకు - Munich లో Chase The Wild ఈవెంట్ లైవ్! కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం యూటర్న్? రంగంలోకి అగ్రనేతలు! కాంగ్రెస్ ‘1000 రోజుల విఫల పాలన’పై ఉధృతమైన బీఆర్ఎస్ నిరసనలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ఛార్జ్‌షీట్: హరీశ్ రావు తీవ్ర ధ్వజం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ నెరవేరిన ఉత్తరాంధ్ర వాసుల కల ..తరలి వచ్చిన గోదారమ్మ నేడు లాచనంగా జలాలు విడుదల చేయనున్న చంద్ర బాబు భూభారతి రీ-సర్వేపై అవగాహన సదస్సు మొగల్తూరులో సీఎం చంద్రబాబు పర్యటన: మత్స్యకారులతో మమేకమై పింఛన్ల పంపిణీ Google షాకింగ్ డెసిషన్ - 8 ఏళ్ల Google Assistant క్లోజ్ - సెప్టెంబర్ 4 నుండి శాశ్వతంగా బంద్ - ఇక అన్ని ఫోన్లలో Gemini యే! Apple కంపెనీలో ఊహించని బిగ్ షాక్ - టాప్ పదవిలో భారీ మార్పు! కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు షాక్: రూ. 9.50 పెరిగిన సిలిండర్ ధర.. కొత్త రేట్లు ఇవే! దుల్కర్ ఐ యామ్ గేమ్ సెప్టెంబర్ 3న రిలీజ్ - రోమాంచకంతో బిగ్ క్లాష్! రామాయంపేటలో రెండు ప్రెస్‌క్లబ్‌ల రద్దు త్వరలో పారదర్శకంగా ఎన్నికలు

కాంగ్రెస్ ‘1000 రోజుల విఫల పాలన’పై ఉధృతమైన బీఆర్ఎస్ నిరసనలు

Select Suryaa Now
కాంగ్రెస్ ‘1000 రోజుల విఫల పాలన’పై ఉధృతమైన బీఆర్ఎస్ నిరసనలు

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమైందంటూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాయి.

కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మేడిపల్లి, బొడుప్పల్ ప్రాంతాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లా రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. గజ్వేల్ పట్టణంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ 'బాకీ కార్డుల' పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

మార్కెట్ రోడ్డులో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ నాయకత్వంలో బీఆర్ఎస్ నాయకులు 100 మీటర్ల భారీ ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను విస్మరించిందని, ప్రజలను వంచించిన ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని నిరసనల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.