భూభారతి రీ-సర్వేపై అవగాహన సదస్సు
బొంరాస్పేట్, దుద్యాల్ మేజర్ న్యూస్: దుద్యాల్ మండలం హంసన్పల్లి గ్రామంలో బుధవారం భూభారతి రీ-సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. సర్వేయర్ మధుసూదన్, ఎమ్మార్వో కిషన్ నాయక్తో కలిసి మండల అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేసి రైతులకు రీ-సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ల్యాండ్ సర్వే రికార్డుల ఏడీఏ మధుసూదన్ మాట్లాడుతూ భూభారతి రీ-సర్వే విధానం, భూముల కొలతలు, రికార్డుల నమోదు తదితర అంశాలను రైతులకు వివరించారు. రీ-సర్వే ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహిస్తామని తెలిపారు.రైతులు తమ భూములకు సంబంధించిన రికార్డులు, వివరాలను ముందుగా పరిశీలించుకోవాలని, సర్వే నిర్వహించే సమయంలో అధికారులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. భూములకు సంబంధించిన సమస్యలు, అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.