BREAKING
నేపాల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు లక్ష్యాలకు మించి బొగ్గు ఉత్పత్తి, రవాణా సీపీఎస్‌ రద్దు చేసి.. ఓపీఎస్‌ పునరుద్ధరించాలి రిటైర్మెంట్‌ తర్వాత భద్రత కోసం నిరసన 23 డిమాండ్లపై చారిత్రాత్మక ఒప్పందం శరవేగంగా ఎత్తిపోతల పనులు... రైతుల్లో ఆశలు అల్లరి నరేష్ కామెడీ కమ్ బ్యాక్ - రంభా ఊర్వశీ మేనక సెప్టెంబర్ 4న రిలీజ్! మేట్టూరు డ్యామ్ ఓపెన్ చేసిన సీఎం విజయ్ - కావేరీ మా హక్కే అంటూ కర్ణాటకకు వార్నింగ్! NEET గొడవకు సుప్రీం బ్రేక్ - విద్యార్థులపై FIR లు రద్దు - సెప్టెంబర్ 5 ర్యాలీ క్యాన్సిల్ - బాధితులకు పరిహారం బిష్కెక్ లో పాక్ కు మోదీ షాక్ - ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అంటూ వార్నింగ్! తిరుపతి సర్వదర్శనానికి ఎంత టైం పడుతుంది? ఈరోజు సెప్టెంబర్ 2 లేటెస్ట్ అప్డేట్ - వెళ్లే ముందు ఇది తప్పక తెలుసుకోండి! తిరుపతి లేటెస్ట్ అప్డేట్ - సెప్టెంబర్ 2న TTD సంచలన నిర్ణయం - బ్రహ్మోత్సవాల వేళ VIP దర్శనాలు బంద్! ఆంధ్ర & తెలంగాణలో ఈరోజు వెండి ధర - సెప్టెంబర్ 2 - షాకింగ్ డౌన్! తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ - సెప్టెంబర్ 2 కొత్త అప్డేట్ - ధరలు తగ్గాయా, పెరిగాయా? రేగోడ్‌లో ‘వన్ మోర్ టీ’ స్పెషల్ ఆభరణాల ప్రియులకు ఊరట

లక్ష్యాలకు మించి బొగ్గు ఉత్పత్తి, రవాణా

Select Suryaa Now
లక్ష్యాలకు మించి బొగ్గు ఉత్పత్తి, రవాణా

సూర్య మందమర్రి: సింగరేణి మందమర్రి ఏరియా నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తూ ప్రగతి సాధిస్తోందని ఏరియా జీఎం ఎన్‌. రాధాకృష్ణ తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టులో బొగ్గు ఉత్పత్తి, రవాణాలో 105 శాతం, ఓబీ తొలగింపులో 102 శాతం ప్రగతి సాధించినట్లు తెలిపారు. ఆర్కేపీ ఓసీ విస్తరణకు ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ ప్రక్రియ వేగవంతమైందని, పెద్దనపల్లి వద్ద 150 ఎకరాల భూసేకరణ కొనసాగుతోందన్నారు. దుబ్బగూడం నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, సీఎంపీఎఫ్‌, పెన్షన్‌ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు రూ.7.5 కోట్లతో హైటెక్‌ కిచెన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏరియా అభివృద్ధికి కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, యూనియన్‌ ప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్‌) సీహెచ్‌. అశోక్, డీజీఎం (ఐఈడీ) కిరణ్‌ కుమార్, సీనియర్‌ పర్సనల్‌ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.