వరుసగా చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
వరుసగా చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
తూప్రాన్ : వరుసగా చిల్లర తనాలు చేస్తున్న నిందితుడిని తూప్రాన్ పోలీసులు కరీం గూడా బ్రిడ్జి వద్ద అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి బైక్, స్కూటీ, గ్యాస్ సిలిండర్లు, తదితర చోరీ సొత్తును రికవరీ చేయడంతో పాటు, అతనికి సంబంధించి ఇతర నేరాల్లో కూడా ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. తూఫాన్ సీఐ వెంకట రాజా గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లాకు చెందిన మామిడి శ్రీకాంత్ అనే వ్యక్తి ఈనెల 29 రాత్రి తూప్రాన్ లో పలుచోరీలకు పాల్పడ్డాడు. నిందితుడి తీసుకొని విచారించి, సీసీ కెమెరా ఆధారాలు మరియు ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ దొంగతనాన్ని ఛేదించారు. ఇందితుడు ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టై ఇటీవల జైలు నుంచి విడుదలై మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు సీఐ వెంకట రాజా గౌడ్ తెలిపారు.