BREAKING
ఎంపీ పదవికి బ్రిటన్ మాజీ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా ఆర్థిక సాధికారతకు 12 ఏళ్లు ఏఐ విద్యుత్ డిమాండ్‌కు స్పేస్‌ఎక్స్ పరిష్కారం ఆర్బీఐ అంచనాలను మించిన భారత్ జీడీపీ ‘చకోర- లూనార్ లవ్ బర్డ్’ నుంచి ‘అద్దంలా చేయనా..’.. ప్రేమను వెన్నెలలా పంచుతున్న మెలోడీ సాంగ్! నేపాల్‌లో వరద విలయం..900 దాటిన మృతుల సంఖ్య ముగిసిన ప్రధాని మోదీ 4 రోజుల పర్యటన ప్రపంచ అనిశ్చితుల వేళ స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు చక్కెర వ్యాపారులకు కేంద్రం బిగ్ షాక్ ఉల్లి ధరలకు కళ్లెం 'కందా ఎక్స్‌ప్రెస్', రోడ్డు మార్గంలో బఫర్ నిల్వల పంపిణీ వేగవంతం! 10 నుంచి 12వ తరగతులకు కొత్త ఎన్‌సిఇఆర్‌టి (NCERT) పాఠ్యపుస్తకాలు భూ రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో అభ్యంతరాల కోసం అప్పిల్ చేసుకోవాలి --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ యుపీని ముంచెత్తిన భారీ వర్షాలు..తీవ్రరూపం దాల్చిన వరదలు యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరించే కంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’ – ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో 41 స్టేషన్లను పీఎన్‌జీకి మార్చనున్న భారత సైన్యం

ఏఐ విద్యుత్ డిమాండ్‌కు స్పేస్‌ఎక్స్ పరిష్కారం

Select Suryaa Now
ఏఐ విద్యుత్ డిమాండ్‌కు స్పేస్‌ఎక్స్ పరిష్కారం

టెక్సాస్‌లో గ్యాస్ టర్బైన్ బ్లేడ్ ఫౌండ్రీ ఏర్పాటు!
ఆస్టిన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ల నుండి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను త్వరితగతిన తీర్చేందుకు అంతరిక్ష పరిశోధన సంస్థ 'స్పేస్‌ఎక్స్' (SpaceX) కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సహజ వాయువు ద్వారా విద్యుత్ ఉత్పత్పి చేసే గ్యాస్ టర్బైన్లలో ఉపయోగించే అత్యంత కీలకమైన బ్లేడ్‌లు, వేన్‌లను తయారు చేసేందుకు టెక్సాస్‌లో ఒక ప్రత్యేక ఇన్-హౌస్ ఫౌండ్రీని స్పేస్‌ఎక్స్ నిర్మిస్తోంది.

ఈ విషయాన్ని స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించారు. విద్యుత్ అవసరాల కోసం సోలార్ ప్యానెల్ ఉత్పత్తిని పెంచుతున్నప్పటికీ, రాబోయే కొన్నేళ్లపాటు సహజ వాయువుపై ఆధారపడటం తప్పనిసరి అని ఆయన తెలిపారు.

సహజ వాయువు టర్బైన్‌ల తయారీలో బ్లేడ్‌లు, వేన్‌లను కాస్టింగ్ చేయడమే ప్రధాన అడ్డంకిగా మారిందని మస్క్ పేర్కొన్నారు. "స్పేస్‌ఎక్స్ లోనే సొంతంగా వీటి కాస్టింగ్ చేయడం వల్ల గ్యాస్ టర్బైన్‌లను అందుబాటులోకి తెచ్చే సమయం ఏకంగా 18 నెలల వరకు తగ్గుతుంది" అని ఆయన వివరించారు.

ఆస్టిన్‌కు తూర్పున ఉన్న బాస్ట్రాప్‌లో, స్టార్‌లింక్ తయారీ ప్లాంట్‌కు ఆనుకుని ఈ ఫౌండ్రీ ఏర్పాటుకానుంది. ఇందుకోసం స్పేస్‌ఎక్స్ ఈ ఏడాది మార్చి-జూన్ మధ్య 830 ఎకరాల భూమిని సేకరించింది. ఈ ప్లాంట్‌లో 1,650°C నుండి 1,980°C వరకు తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకునే 'సింగిల్-క్రిస్టల్ నికెల్-సూపర్‌అల్లాయ్' భాగాలను తయారు చేయనున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక ఫౌండ్రీలు 2029-30 వరకు పూర్తి బుకింగ్‌లతో నిండిపోవడంతో విద్యుత్ ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతోంది. స్పేస్‌ఎక్స్ నిర్ణయం దీనికి ముగింపు పలకనుంది.

ఏరోస్పేస్ లో ఉపయోగించే రాప్టర్ టర్బైన్ విభాగాలు మరియు ఏఐ డేటా సెంటర్ టర్బైన్ భాగాలు ఒకే రకమైన లోహాలపై ఆధారపడి ఉండటం వల్ల, ఈ ఒక్క ఫౌండ్రీతో స్పేస్‌ఎక్స్ రెండు రకాల అవసరాలనూ తీర్చగలదని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, పర్యావరణ అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో ప్లాంట్ ప్రారంభ తేదీని ఇంకా ప్రకటించలేదు.