భూ రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో అభ్యంతరాల కోసం అప్పిల్ చేసుకోవాలి --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
భూ రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో అభ్యంతరాల కోసం అప్పిల్ చేసుకోవాలి
--జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్..
మెదక్ : జిల్లాలో భూ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అభ్యంతరాల కోసం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఆపిల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.మంగళవారం మెదక్ తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో భూ సర్వే పూర్తయిన ఆరు గ్రామాల్లో భూ సమస్యలపై అభ్యంతరాలు ఉంటే 9(2) యాక్ట్ ద్వారా అప్పీల్ చేసుకుంటే తహసిల్దార్ కార్యాలయంలో డి టి లెవల్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ అధికారుల ద్వారా సమస్యలకు పరిష్కారం అవుతుందని అన్నారు.తహసిల్దార్ కార్యాలయంలో రిసర్వే అప్పీల్ కోసం కౌంటర్లను ఏర్పాటు చేయని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, ఏడి ల్యాండ్ సర్వే కిషన్, తాహాసిల్దార్ లక్ష్మణ్ బాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.