BREAKING
2026-27 ఆర్థిక సంవత్సరంలో 41 స్టేషన్లను పీఎన్‌జీకి మార్చనున్న భారత సైన్యం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి.. పాక్‌లో వందేళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత నేపాల్ వరద బాధితులకు ఆపద్బాంధవుడు సోనూ సూద్ సాయం నేరస్తుల గుర్తింపు వివాదం, పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు విద్యార్థులపై కేసులు ఉపసంహరణ ఉచితంగా రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లు.. కొత్త సోలార్ పాలసీ ప్రారంభం! భాస్కర్ చారికి ఘన వీడ్కోలు వినాయక చవితి ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు: మంత్రి పొన్నం ప్రభాకర్ మాధవ్ ‘మారెమ్మ’ ట్రైలర్ రిలీజ్.. సినిమాపై శివ నిర్వాణ ఆసక్తికర వ్యాఖ్యలు మైనారిటీ మహిళలకు ఆర్థిక చేయూత ఢిల్లీ వేదికగా వేడెక్కిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి ‘సబ్‌కో’ సాంగ్ రిలీజ్.. యూత్‌ను ఊర్రూతలూగిస్తున్న హేషమ్ మ్యూజిక్ "చేతకాకపోతే తప్పుకోండి" తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ - ప్రభుత్వ స్కూల్ లో చదివితే ఉచిత టిఫిన్ + పాలు - నవంబర్ 15 నుంచి 33 జిల్లాల్లో అమలు - మెనూలో రాగి జావ!

మైనారిటీ మహిళలకు ఆర్థిక చేయూత

Select Suryaa Now
మైనారిటీ మహిళలకు ఆర్థిక చేయూత

మంత్రి శ్రీధర్ బాబు 

225 మందికి రూ.50 వేల చొప్పున చెక్కుల పంపిణీ

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 1):
మైనారిటీ మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దేందుకు ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ను అమలు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 225 మంది మైనారిటీ మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు.

స్వయం ఉపాధి, చిన్నతరహా వ్యాపారాలకు ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయడంతో పాటు మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తున్నట్లు తెలిపారు. మైనారిటీల జీవనోపాధి, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.