2026-27 ఆర్థిక సంవత్సరంలో 41 స్టేషన్లను పీఎన్జీకి మార్చనున్న భారత సైన్యం
'పీఎన్జీ ట్రాన్సిషన్' మార్గదర్శిని ఆవిష్కరణ!
న్యూఢిల్లీ: గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా భారత సైన్యం కీలక అడుగు వేసింది. దేశంలోని సాధ్యమైన అన్ని సైనిక స్థావరాలలో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ఢిల్లీ కంటోన్మెంట్లోని మానేక్షా సెంటర్లో ‘పీఎన్జీ ట్రాన్సిషన్ వెబినార్-2026’ను నిర్వహించింది.
41 సైనిక స్టేషన్లలో పీఎన్జీ ప్రాజెక్ట్
ఈ చొరవలో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి విడతగా 41 సైనిక స్టేషన్లను పీఎన్జీకి మార్చాలని, ఆ తర్వాత ఇతర స్థావరాలకు దీనిని విస్తరించాలని భారత సైన్యం ప్రణాళిక రూపొందించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
'పీఎన్జీ మార్గదర్శిని' విడుదల
పరివర్తన ప్రక్రియ సురక్షితంగా, వ్యవస్థీకృతంగా జరిగేందుకు వీలుగా భారత సైన్యం ఒక ప్రత్యేక 'పీఎన్జీ మార్గదర్శిని'ని ఆవిష్కరించింది. ఇది పరిపాలనా, సాంకేతిక, భద్రతా మరియు అమలు అవసరాలను కవర్ చేస్తూ ఒక ప్రామాణిక సూచన పత్రంగా ఉపయోగపడనుంది.
కీలక భాగస్వాముల సుదీర్ఘ చర్చలు
ఈ వెబినార్లో భారత సైన్యంతో పాటు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (PNGRB), డిఫెన్స్ ఎస్టేట్స్ ఆర్గనైజేషన్, మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (MES), మరియు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
చట్టబద్ధమైన అనుమతులు, భూమి మరియు మౌలిక వసతుల పనులు, సాంకేతిక అంశాలు, భద్రతా నియమావళి, అకౌంటింగ్ మరియు రీయింబర్స్మెంట్ యంత్రంగాలు. సైనిక ప్రాంగణాల్లో పీఎన్జీని సజావుగా స్వీకరించేలా సీజీడీ సంస్థల సంసిద్ధత, స్టేషన్ల స్థాయి అమలు మరియు భద్రతా అవసరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
సైనిక స్థావరాలలో పీఎన్జీకి సురక్షితమైన, సమర్థవంతమైన మరియు సుస్థిరమైన పరివర్తనను సాధించడానికి తాము పూర్తి కట్టుబడి ఉన్నామని భారత సైన్యం ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.