అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి..
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి..
సంగారెడ్డి ; ఆందోల్ నియోజకవర్గంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వంద శాతం విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. మంగళవారం సంగారెడ్డిలోని తన నివాసంలో బూత్ స్థాయి ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో అవగాహన సమావేశం నిర్వహించారు.
నోటీసులు అందుకున్న ఓటర్లకు అవసరమైన ధ్రువపత్రాలను సంబంధిత అధికారులకు సకాలంలో అందించేలా సహకరించాలని బూత్ స్థాయి ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ విజయవంతానికి కృషి చేస్తున్న బూత్ స్థాయి ప్రతినిధులను మంత్రి అభినందించారు