BREAKING
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి.. పాక్‌లో వందేళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత నేపాల్ వరద బాధితులకు ఆపద్బాంధవుడు సోనూ సూద్ సాయం నేరస్తుల గుర్తింపు వివాదం, పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు విద్యార్థులపై కేసులు ఉపసంహరణ ఉచితంగా రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లు.. కొత్త సోలార్ పాలసీ ప్రారంభం! భాస్కర్ చారికి ఘన వీడ్కోలు వినాయక చవితి ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు: మంత్రి పొన్నం ప్రభాకర్ మాధవ్ ‘మారెమ్మ’ ట్రైలర్ రిలీజ్.. సినిమాపై శివ నిర్వాణ ఆసక్తికర వ్యాఖ్యలు మైనారిటీ మహిళలకు ఆర్థిక చేయూత ఢిల్లీ వేదికగా వేడెక్కిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి ‘సబ్‌కో’ సాంగ్ రిలీజ్.. యూత్‌ను ఊర్రూతలూగిస్తున్న హేషమ్ మ్యూజిక్ "చేతకాకపోతే తప్పుకోండి" తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ - ప్రభుత్వ స్కూల్ లో చదివితే ఉచిత టిఫిన్ + పాలు - నవంబర్ 15 నుంచి 33 జిల్లాల్లో అమలు - మెనూలో రాగి జావ! సెప్టెంబర్ 3న థియేటర్లలో రోమాంచకం మొదలు - యూత్ ని ఊపేయడానికి వస్తున్న కొత్త జోడీ!

ఢిల్లీ వేదికగా వేడెక్కిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం

Select Suryaa Now
ఢిల్లీ వేదికగా వేడెక్కిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం

కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్, కీలక నేతల భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా ఢిల్లీ వేదికగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధిష్టానం అత్యవసరంగా కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో మరికాసేపట్లో ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశం ప్రాధాన్యత దృష్ట్యా కేసీ వేణుగోపాల్ తన నాసిక్ పర్యటనను సైతం రద్దు చేసుకోవడం గమనార్హం.

ఈ కీలక భేటీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

సురేఖ వ్యవహారంపై ప్రత్యేక చర్చ?
ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన మంత్రి కొండా సురేఖ, నేత చిన్నారెడ్డిల వ్యవహారాలతో పాటు ప్రభుత్వ పాలన, పార్టీ అంతర్గత అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ కేసీ వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ కోరగా, ఆమె మరికొద్ది సేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు.

మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఢిల్లీలోనే విడిది చేశారు. మంగళవారం ఉదయమే స్పీకర్ గడ్డం ప్రసాద్ AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసి పలు అంశాలపై మాట్లాడారు. కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశం పూర్తయిన అనంతరం, నేతలందరూ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరగబోయే మరొక కీలక భేటీకి హాజరుకానున్నారు. అధిష్టానం పిలుపుతో ఈ భేటీలు జరుగుతుండటంతో కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.