భాస్కర్ చారికి ఘన వీడ్కోలు
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB), సనత్నగర్లో సెక్యూరిటీ పర్సన్గా 11 సంవత్సరాలపాటు సేవలందించిన వై. భాస్కర్ చారి పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అందించిన సేవలను అధికారులు, ఉద్యోగులు కొనియాడారు. వై. భాస్కర్ చారిని శాలువాతో సత్కరించి, పదవీ విరమణ అనంతర జీవితం సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా సాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో TGPCB అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అరుణ, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (OUSEA) అధ్యక్షుడు సి. మధు గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆర్. నవీన్ గౌడ్, రాజా రమేష్, బాబుగౌడ్, రఘు, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.