BREAKING
ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి ‘సబ్‌కో’ సాంగ్ రిలీజ్.. యూత్‌ను ఊర్రూతలూగిస్తున్న హేషమ్ మ్యూజిక్ "చేతకాకపోతే తప్పుకోండి" తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ - ప్రభుత్వ స్కూల్ లో చదివితే ఉచిత టిఫిన్ + పాలు - నవంబర్ 15 నుంచి 33 జిల్లాల్లో అమలు - మెనూలో రాగి జావ! సెప్టెంబర్ 3న థియేటర్లలో రోమాంచకం మొదలు - యూత్ ని ఊపేయడానికి వస్తున్న కొత్త జోడీ! గణేష్ ఉత్సవాలు, కృష్ణాష్టమి పై విద్యుత్ శాఖ దృష్టి సెప్టెంబర్ 24న నాని ప్యారడైజ్ - ఇరుముడి తర్వాత టాలీవుడ్ లో మరో సంచలనం బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండించిన కరణం ప్రహ్లాద్ రావు ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలి మానవీయ కోణంలో సేవలు అందించాలి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య యోధురాలిగా రష్మిక.. ‘మైసా’ రిలీజ్ డేట్ ఫిక్స్ మార్కెట్లో షాక్.. సెన్సెక్స్, నిఫ్టీ డౌన్! ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్.. అసలు కారణం ఇదే! సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ (ఐసీసీ) లో ఘనంగా సీపీఎస్ విద్రోహ దినం. రేవంత్ సర్కార్ 1000 రోజుల రిపోర్ట్ కార్డు ఫెయిల్ - 6 గ్యారంటీలలో ఒక్కటీ అమలు కాలేదు - బీజేపీ సంచలన ఆరోపణలు చిట్కుల్ కాంగ్రెస్ నేతలు హరీశ్‌రావుతో భేటీ అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నాయకుడు ముందుండాలి వర్షాలు కురిపించు ప్రభువా *అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో వర్షాల* కోసంప్రత్యేక ప్రార్థన *సమావేశం

"చేతకాకపోతే తప్పుకోండి"

Select Suryaa Now
"చేతకాకపోతే తప్పుకోండి"

ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల్లో జాప్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం

“చేతకాకపోతే తప్పుకోండి.. 4న సీఎం దృష్టికి తీసుకెళ్తా”

యాలాల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 1): మండలంలోని దౌలాపూర్ సమీపంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల్లో జాప్యంపై తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపన చేసి ఏడాది పూర్తవుతున్నా పనుల్లో ఆశించిన పురోగతి లేకపోవడంపై ప్రాజెక్టు మేనేజర్‌ను ప్రశ్నించారు.

“పనులు చేయలేకపోతే బాధ్యతల నుంచి తప్పుకోండి.. మిమ్మల్ని నమ్ముకుంటే నేను మునుగుతా” అంటూ హెచ్చరించారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేసిన ఎమ్మెల్యే, సెప్టెంబర్ 4న ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని తెలిపారు. ఇకనైనా పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో యాలాల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహిపాల్, సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, హన్మంత్ ముదిరాజ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అగ్గనూర్ వీరేశం తదితరులు పాల్గొన్నారు.