వర్షాలు కురిపించు ప్రభువా *అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో వర్షాల* కోసంప్రత్యేక ప్రార్థన *సమావేశం
*
వైకుంఠపురం లోని జీవముగల దేవుని ప్రార్థన మందిరంలో పాస్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అమరావతి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఉప-అధ్యక్షులుగా పాస్టర్ గుర్రం విజయ్ కుమార్, అధ్యక్షత వహించారు . అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ సలహాదారులు పాస్టర్ అశోక్ కుమార్ అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ మాట్లాడుతూ అమరావతి లో
పాస్టర్ల సంక్షేమం, సంరక్షణ కొరకు అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ గత 25 సంవత్సరాల క్రితం అన్ని సంఘాలతో కలిసి "సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు! ఎంత మనోహరము!” తెలిపారు.
అమరావతి ప్రాంత పాస్టర్లు అందరూ ఐక్యతతో దైవ సేవలు కొనసాగించాలని ప్రబోధించారు అనంతరం పాస్టర్స్ అందరూ ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య శాంతిగా ఉండాలని అలాగే మంచి వర్షాలు కురిసి పాడి పంటలు అభివృద్ధి చెందాలని దైవ దీవెనలు అమరావతి ప్రాంతం మీద ఉండాలని ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలముగా ఉండాలని ప్రార్థించారు . ఈ కార్యక్రమంలో అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ నండూరి పీటర్ పాల్ ,అమరావతి మండల పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులుగా పాస్టర్ జొన్నకూటి ప్రభుదాసు గారిని సలహాదారులుగా , పాస్టర్ గుడిసె ప్రభుదాస్ , పాస్టర్ జొన్నకూటి జయ రావు, అమరావతి మండల పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీ పాస్టర్ తోకల ఎలీషా, చేసిన, ట్రెజర్ పాస్టర్ గుడిసె ప్రకాష్, జాయింట్- ట్రెజర్ జోసఫ్ , డైరెక్టర్స్ పాస్టర్ నండూరి జోర్నేస్, పాస్టర్ ఇర్మియ ఈ కార్యక్రమానికి అమరావతి ప్రాంత పాస్టర్లు అందరూ హాజరయ్యారు.