ఖర్గేను కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
న్యూఢిల్లీ, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 1): రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖర్గేను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు.
కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) కాన్ఫరెన్స్ సన్నాహక సమావేశం పార్లమెంట్ కమిటీ హాల్లో జరగనున్న నేపథ్యంలో స్పీకర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట OSD పి. వెంకటేశం, వికారాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గూడెం రాములు యాదవ్ ఉన్నారు.