అంగడి చిట్టంపల్లి-లాల్ పాడ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి
*మంత్రి కోమటిరెడ్డి కి వినతి
పూడూరు, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 01):
అంగడిచిట్టంపల్లి–కంకల్–లాల్పాడు ఆర్అండ్బీ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ ఐఏఎస్లను మంగళవారం సచివాలయంలో కలిసి మెమొరాండం అందజేశారు. రహదారికి సంబంధించిన వివరాలను మంత్రిని, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఐటీ ఇన్చార్జ్ రవీంద్ర కంకల్, జిల్లా కో-కన్వీనర్ కన్నయ్యల రాజు, కండ్లపల్లి శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.