పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే పట్టుదల అవసరం– కలెక్టర్ ప్రతీక్ జైన్
పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే పట్టుదల అవసరం– కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి,; పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం సాధించవచ్చని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.సంగారెడ్డి బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్-1, 2, 3, 4, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్, పోలీస్ తదితర పోటీ పరీక్షలకు నిర్వహించే ఐదు నెలల ఉచిత ఫౌండేషన్ శిక్షణను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం స్టడీ సర్కిల్లోని తరగతి గదులు, మౌలిక సదుపాయాలను పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి జగదీష్, డైరెక్టర్ ప్రవీణ్, శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు.