ఎడ్యుకేషన్ హబ్ పనులు వేగవంతం చేయాలి
నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలి: సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్
బొంరాస్ పేట్ / దుద్యాల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 1): దుద్యాల మండలం హకీంపేట్, పోలేపల్లి ఎడ్యుకేషన్ హబ్లో కొనసాగుతున్న భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ దీపక్ తివారితో కలిసి హబ్లోని వివిధ నిర్మాణ పనులను పరిశీలించారు. వారానికో లక్ష్యం నిర్దేశించుకుని పనుల పురోగతి ఉండాలని, నాణ్యతలో రాజీ పడొద్దని సూచించారు. అవసరమైన మౌలిక వసతులపై ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.