వెలిగొండకు పామూరు టీడీపీ నేతలు తరలింపు
పామూరు, మేజర్ న్యూస్ : వెలిగొండ ప్రాజెక్టు నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలను విడుదల చేయనున్న నేపథ్యంలో పామూరు నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. వెలిగొండ జలాల విడుదలతో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం కానుందన్న ఆశాభావంతో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా కార్యక్రమానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు అడుసుమల్లి ప్రభాకర్, గుంటుపల్లి శ్రీనివాసులు, పువ్వాడివెంకటేశ్వర్లు బిల్డర్, పువ్వాడి రామారావు, ఉప్పుగండ్ల రమేష్, కంచర్ల శ్రీనివాసులు, బైరెడ్డి వెంకటేశ్వర్లు, కల్లూరి తిరుపతయ్య, ఎలిక నాగశేషులు, రావి సూరయ్య చౌదరి, ఆవుల రమణమ్మ తదితరులు వాహనాల్లో తరలి వెళ్లారు.