నేడు దరూర్ లో మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పర్యటన
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (ఆగస్టు 31):వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సోమవారం ధారూర్ మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.ఉదయం 10 గంటలకు ధారూర్ మండల కేంద్రంలో నిర్వహించే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.
మాజీ ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో ఆయా కార్యక్రమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్నారు. భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.