BREAKING
బెంగళూరు ట్రాఫిక్‌పై వైరల్ వీడియో: అహ్మదాబాద్ ఫ్లైట్ సమయం కంటే ఎయిర్‌పోర్ట్ ప్రయాణమే సుదీర్ఘం వెలిగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ వార్: రాజకీయ దుమారం రేపుతున్న వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు పంచాయితీ ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం పగిలిన మ్యాన్ హోల్... పొంచి ఉన్న ప్రమాదం. అరగోన్ గ్రాండ్ ప్రిక్స్‌ విజేతగా మార్క్ మార్క్వెజ్: టైటిల్ రేసులో దూకుడు భక్తిశ్రద్ధలతో గంగమ్మ తల్లి తిరునాళ ఫ్రెంచ్ చేపల పడవ మునక.. ఇద్దరు సిబ్బంది గల్లంతు వెస్ట్ బ్యాంక్‌లో యూదు సెటిలర్ల దాడులను తీవ్రంగా ఖండించిన నెతన్యాహు ఈయూలో చేరేందుకు చర్చల పునఃప్రారంభాన్ని తిరస్కరించిన ఐస్‌లాండ్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుంది నేపాల్‌లో ముమ్మరంగా వరద సహాయక చర్యలు పర్యాటకాన్ని ఆదుకోవాలని నటి మనీషా కొయిరాలా విజ్ఞప్తి నేపాల్ వరద బాధితులకు సద్గురు ఓదార్పు ఢిల్లీలో 95 ఎకరాల భూమి పునరుద్ధరణ మధ్య వయస్సులోని మహిళలు ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి    – మిసెస్‌ ఇండియా యూఎస్‌ఏ డాక్టర్‌ మాలిని సందడి

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

Select Suryaa Now
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (ఆగస్టు 30):వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగపూర్ సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతల చెరువు సమీపంలో రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కారులో మొత్తం నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో ఖాజా బీ (65), జహంగీర్ బీ (78) మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, మృతులు మరియు క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.