ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (ఆగస్టు 30):వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగపూర్ సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతల చెరువు సమీపంలో రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కారులో మొత్తం నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో ఖాజా బీ (65), జహంగీర్ బీ (78) మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, మృతులు మరియు క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.