ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బాధితులకు న్యాయం చేయాలి
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్
హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ వల్ల నష్టపోయిన బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చొరవ తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బాధితుల తరఫున ఒవైసీ నేరుగా స్పందించాలని కోరారు.
అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా బాధితులను డీజీపీ లేదా పోలీస్ కమిషనర్ వద్దకు తీసుకెళ్లాలి. తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ పోలీసులకు అందజేసి, ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్పై చట్టపరమైన కేసు నమోదు చేయించాలి. బాధితులకు పరిపూర్ణ న్యాయం జరిగేలా చూసే బాధ్యత ఎంఐఎం నాయకత్వంపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు.