"ముస్లింలు లేని భారత్ను కోరుకునేవారు హిందువులే కారు"
న్యూయార్క్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్: భారతదేశంలో ముస్లింలు ఉండకూడదని ఏ హిందువైనా భావిస్తే, అతను అసలు హిందువే కాడని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన 'వన్ వరల్డ్, వన్ హ్యుమానిటీ' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
హిందూత్వ సారాంశాన్ని, భారత్ బహుళత్వాన్ని వివరిస్తూ మోహన్ భగవత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
మిమ్మల్ని మీరు హిందువుగా చెప్పుకోవాలంటే.. మార్గాలు వేరైనా అవన్నీ ఒకే పరమసత్యానికి దారితీస్తాయని మరియు ప్రతి మనిషికీ గౌరవం ఉంటుందని తప్పక నమ్మాలి. మనుషుల మధ్య ఎలాంటి ప్రాథమిక వ్యత్యాసం లేదు. మతాలు, ఆచారాలు వేరైనప్పటికీ మానవత్వం ఒక్కటేనని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. భిన్నత్వం అనేది ప్రకృతి నియమం అయితే, ఆ భిన్నత్వంలో ఏకత్వమే శాశ్వత సత్యం.
ఆధ్యాత్మిక ఆలోచనలను, మానవీయ విలువలను పంచుకుంటూ భారతదేశం సదా విశ్వశాంతికి, ఐక్యతకు కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు.