ప్రధాని నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం
"ఒలియ్ దరాజలి దోస్త్లిక్" ప్రధానం
న్యూఢిల్లీ: భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, స్నేహాన్ని బలోపేతం చేయడంలో విశేష కృషి చేసినందుకు గాను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం తమ అత్యున్నత గౌరవాన్ని ప్రకటించింది. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ ఈ రోజు ప్రధాని మోదీకి "ఒలియ్ దరాజలి దోస్త్లిక్" (Order of High Degree Friendship) ఆర్డర్ను ప్రదానం చేశారు.
ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఇది విదేశీ నాయకులకు ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం అందించే అతిపెద్ద మరియూ అత్యున్నత గౌరవమని తెలిపింది. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన దౌత్య బంధానికి, పరస్పర నమ్మకానికి నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.