ఆటోను ఢీకొన్న కోళ్ల వ్యాన్.. ఒకరు మృతి
కరీంనగర్ ప్రతినిధి గంగాధర మండలం మంగంపేట నుంచి వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను గంగాధర–కరీంనగర్ రోడ్డులో ర్యాకం లక్ష్మయ్య ఫంక్షన్హాల్ వద్ద కోళ్ల వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లింగాల దేవమ్మ (55) తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో కరీంనగర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం క్షతగాత్రులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ను కోరారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున పరిహారం అందించాలని సీఎంఓ కార్యాలయానికి ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు.