కాలనీ సమస్యకు త్వరలో పరిష్కారం
సాయి నగర్ కాలనీ సమస్యకు త్వరలో పరిష్కారం…
మెదక్ మేజర్ న్యూస్ ప్రతినిధి ; సాయి నగర్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను యంగ్ డైనమిక్ లీడర్ డాక్టర్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దృష్టికి తీసుకెళ్లి, అతి త్వరలో సమస్యను పరిష్కరింపజేస్తామని మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కానుగు రాధిక భూపతి రాజు హామీ ఇచ్చారు.సాయి నగర్ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిని నేషనల్ హైవే–R&B అధికారులు బ్లాక్ చేయడంతో కాలనీ వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన చైర్పర్సన్ వెంటనే స్పందించారు.