రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుంది
పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్
హైదరాబాద్, ఆగస్టు 30: రాబోయే గ్రేటర్ హైదరాబాద్ (GHMC), మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ అత్యంత బలంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ ప్రకటించారు. నగర పరిధిలో పార్టీని వీధి స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా కార్యచరణ వేగవంతం చేశామని ఆయన వెల్లడించారు.
సముచిత ప్రణాళికతో, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే క్షేత్రస్థాయి నాయకులను, అభ్యర్థులను స్థానిక ఎన్నికల బరిలో నిలుపుతామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, డివిజన్ల వారీగా స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పోరాడుతుందని స్పష్టం చేశారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లి ఈ ఎన్నికల్లో మెరుగైన విజయాలు సాధిస్తామని తాళ్ళూరి రామ్ ధీమా వ్యక్తం చేశారు.