BREAKING
పగిలిన మ్యాన్ హోల్... పొంచి ఉన్న ప్రమాదం. అరగోన్ గ్రాండ్ ప్రిక్స్‌ విజేతగా మార్క్ మార్క్వెజ్: టైటిల్ రేసులో దూకుడు భక్తిశ్రద్ధలతో గంగమ్మ తల్లి తిరునాళ ఫ్రెంచ్ చేపల పడవ మునక.. ఇద్దరు సిబ్బంది గల్లంతు వెస్ట్ బ్యాంక్‌లో యూదు సెటిలర్ల దాడులను తీవ్రంగా ఖండించిన నెతన్యాహు ఈయూలో చేరేందుకు చర్చల పునఃప్రారంభాన్ని తిరస్కరించిన ఐస్‌లాండ్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుంది నేపాల్‌లో ముమ్మరంగా వరద సహాయక చర్యలు పర్యాటకాన్ని ఆదుకోవాలని నటి మనీషా కొయిరాలా విజ్ఞప్తి నేపాల్ వరద బాధితులకు సద్గురు ఓదార్పు ఢిల్లీలో 95 ఎకరాల భూమి పునరుద్ధరణ మధ్య వయస్సులోని మహిళలు ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి    – మిసెస్‌ ఇండియా యూఎస్‌ఏ డాక్టర్‌ మాలిని సందడి ఉజ్బెకిస్తాన్ పర్యటన ముగించుకుని కిర్గిజ్‌స్థాన్‌కు ప్రయాణమైన ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రరూపం దాల్చిన మందాకిని హిమాచల్ సరిహద్దుల్లో సైనిక సంసిద్ధత సమీక్ష

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుంది

Select Suryaa Now
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుంది

పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్
హైదరాబాద్, ఆగస్టు 30: రాబోయే గ్రేటర్ హైదరాబాద్ (GHMC), మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ అత్యంత బలంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ ప్రకటిం‌చారు. నగర పరిధిలో పార్టీని వీధి స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా కార్యచరణ వేగవంతం చేశామని ఆయన వెల్లడించారు.

సముచిత ప్రణాళికతో, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే క్షేత్రస్థాయి నాయకులను, అభ్యర్థులను స్థానిక ఎన్నికల బరిలో నిలుపుతామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, డివిజన్ల వారీగా స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పోరాడుతుందని స్పష్టం చేశారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లి ఈ ఎన్నికల్లో మెరుగైన విజయాలు సాధిస్తామని తాళ్ళూరి రామ్ ధీమా వ్యక్తం చేశారు.