హుజురాబాద్ లో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు ---300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
సూర్య,హుజురాబాద్
హుజురాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామంలో తిరుమల ఇండస్ట్రీస్ పై సివిల్ సప్లై అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇండస్ట్రీస్ లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రేషన్ బియ్యం నిల్వ ఉంచిన బాధ్యులైన వ్యాపారస్తుడు శీల శ్రీనివాస్, తిరుపతి సురేష్, అంగిడి తిరుపతి, రేషన్ డీ డి వినోద, మిల్లు యజమాని ఉపేందర్ల పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న రెండు ట్రాలీ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో తిమ్మాపూర్ డీటీసీఎస్ విజయ్ కుమార్, హుజురాబాద్ సివిల్ సప్లై ఇన్స్పెక్టర్లు వినోద్ కుమార్, తిమ్మాపూర్ ఎండి, అన్వరుల్లాఖాన్, హైదరాబాదు టాస్క్ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.